హమ్మయ్య... రైళ్లల్లో కక్కుర్తి బెర్త్ ( సైడ్ మిడిల్ ) లు తీసేస్తున్నారు అని సంబరపడి ఒక్క రోజు కూడా అవ్వలేదు, అప్పుడే ఇంకొక మూర్ఖపు ఆలోచనతో తయారయ్యారు మన రైల్వే శాఖ వారు.
ఈ క్రింద ఇచ్చిన లింక్ చూడండి.
http://www.eenadu.net/story.asp?qry1=18&reccount=28
ఇప్పుడు దీని వల్ల ఇంకెంత ఇబ్బంది పడాలో మరి. ఈ కొత్త ఆలోచనంత, మూర్ఖపు ఆలోచన ఇంకొకటి ఉండదనుకుంటాను.
మన రైల్వే వాళ్ళకి ప్రయాణీకుల సౌకర్యం కంటే, ధనార్జనే ముఖ్యంగా కనిపిస్తుంది.
7, మే 2009, గురువారం
కొంచెం ఆలోచించండి రాహుల్ గాంధీ గారు....!
మొన్నక సారి, ఎన్నికల ప్రచార సభలో ఎక్కడో సరిగ్గా గుర్తులేదు గాని, మన ప్రియతమ యువ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, మన భారతదేశం లో ఉన్న ఒకే ఒక సమస్య పేదరికం, దానిని నిర్మూలించటానికి తానూ శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. చాలా మంచిది. కాని పేదరికం ఒక్కటేనా మన భారతదేశం లో ఉన్న సమస్య.?
అవినీతి,
నిరుద్యోగం,
కుల మత ఘర్షణలు,
ప్రాంతీయవాద ఘర్షణలు,
పెరిగిపోతున్న జనాభా,
నియంత్రణ లేని ధరల పెరుగుదల, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,
కనీస ప్రమాణాలు కూడా లేని విద్య, మారుమూల ప్రాంతాల్లో పేదవాళ్ళకు అందని కనీస ప్రాధమిక విద్య,
కనీస సౌకర్యాలు లేని ప్రదేశాలు మన దేశం లో ఎన్నో వున్నాయి, పెరుగుతున్న మానవ వనరుల వలసలు,
సరిహద్దు దేశాల దాడులు, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉగ్రవాదం మరియు నక్సలిజం,
ఇవ్వన్నీ మన భారతదేశం లో వున్న సమస్యలు కాదా..?
మన దేశం లో ఇన్ని సమస్యలు పెట్టుకుని పేదరికం ఒక్కటే మన దేశంలో వున్న సమస్య అనటం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కొంచెం ఆలోచించండి రాహుల్ గాంధీ గారు....!
ఇకనైనా మన రాజకీయ నాయకులు అన్ని సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిద్దాం. :) :)
అవినీతి,
నిరుద్యోగం,
కుల మత ఘర్షణలు,
ప్రాంతీయవాద ఘర్షణలు,
పెరిగిపోతున్న జనాభా,
నియంత్రణ లేని ధరల పెరుగుదల, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల,
కనీస ప్రమాణాలు కూడా లేని విద్య, మారుమూల ప్రాంతాల్లో పేదవాళ్ళకు అందని కనీస ప్రాధమిక విద్య,
కనీస సౌకర్యాలు లేని ప్రదేశాలు మన దేశం లో ఎన్నో వున్నాయి, పెరుగుతున్న మానవ వనరుల వలసలు,
సరిహద్దు దేశాల దాడులు, అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉగ్రవాదం మరియు నక్సలిజం,
ఇవ్వన్నీ మన భారతదేశం లో వున్న సమస్యలు కాదా..?
మన దేశం లో ఇన్ని సమస్యలు పెట్టుకుని పేదరికం ఒక్కటే మన దేశంలో వున్న సమస్య అనటం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కొంచెం ఆలోచించండి రాహుల్ గాంధీ గారు....!
ఇకనైనా మన రాజకీయ నాయకులు అన్ని సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిద్దాం. :) :)
6, మే 2009, బుధవారం
కక్కుర్తి బెర్తులు...
కక్కుర్తి బెర్తులు... అంటే ఏంటో తెలుసా. రైలు భోగిల్లో, రైల్వే శాఖ ప్రవేశపెట్టిన side middle బెర్త్. ఆ బెర్త్ కి ఈనాడు వారు చేసిన నామకరణం కక్కుర్తి బెర్తులు. ఒకరకంగా కక్కుర్తి బెర్త్ అనే పదం సరిగ్గా సరిపోతుంది. ఈ సైడ్ మిడిల్ బెర్త్ ప్రవేశపెట్టినప్పుడు రైల్వీశాఖ వారు ఏమి చెప్పారో తెలుసా, ప్రయాణీకుల సౌకర్యార్ధం వారికీ ఎక్కువ సీట్లు లభించడం కోసం, దూరప్రయాణం చేసే ప్రయాణికులు సుఖంగా నిద్రించి ప్రయాణం చేయటం కోసం ఈ ఏర్పాటు చేసాం అని చెప్పటం జరిగింది. చాల ఇరుకుగా వుండే ఆ బెర్త్ లో సుఖ నిద్ర ఎలా పడుతుందో మరి ఆ అధికారులకే తెలియాలి. ఈ బెర్త్ వల్ల జరిగిన ఇంకొక అపకారం ఏంటంటే side upper బెర్త్ లో వున్నవాళ్ళకి కూడా సరిగా నిద్ర పట్టదు. కావున ఒక side middle బెర్త్ ఏర్పాటు చేయటం వల్ల చెడింది ఇద్దరు.
ప్రయాణీకులని ఇబ్బంది పెట్టే ఈ ఆలోచన మన రైల్వే అధికారులదా లేక లాలు ప్రసాద్ గారిదా?? ఎవరిడైతేనేమి ఇది రైల్వే వారి ఆలోచనా రాహిత్యానికి ఒక నిదర్శనం. ఒకసారి లాలు గారిని ఆ బెర్త్ లో ప్రయాణం చేయమని చెప్పాలి, అప్పుడు ఆయనికి ప్రయాణీకుల ఇబ్బంది తెలిసివచ్చేది.
బెర్త్లు సరిపోకపోతే ఇంకొక భోగి పెంచటమో లేక పోతే వీలుని బట్టి ఆ మార్గం లో ఇంకొక రైలు పెంచటమో చెయ్యాలి గాని ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు కాదు. అయినా కొత్త రైళ్ళు భిహార్ కే సరిపోవటం లేదు ఇక మిగిలిన రాష్ట్రాలకేమిస్తారు.
ఇప్పుడు అందరికి శుభవార్త ఏంటంటే ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని, ఈ కక్కుర్తి బెర్తుల తొలగింపు చర్య మొదులు పెట్టారు మన రైల్వే వారు, దేవుడా ఇప్పటికైనా మా మీద నీకు దయ కలిగింది సంతోషం, అలాగే రైల్వే వారికి కృతజ్ఞతలు మరియు శతకోటి నమస్కారాలు.
ఈ కక్కుర్తి బెర్త్ ల వల్ల బాగుపడింది ఎవరంటే, వాటిని అమర్చిన కాంట్రాక్టర్లు, కంపెనీలు. ఇంతకాలం ఇబ్బంది పడింది మాత్రం ప్రయాణికులు.
ఈ తొలగింపు తొందరగా పుర్తికావాలని కోరుకుంటూ..... ధన్యవాదాలు :) .
ప్రయాణీకులని ఇబ్బంది పెట్టే ఈ ఆలోచన మన రైల్వే అధికారులదా లేక లాలు ప్రసాద్ గారిదా?? ఎవరిడైతేనేమి ఇది రైల్వే వారి ఆలోచనా రాహిత్యానికి ఒక నిదర్శనం. ఒకసారి లాలు గారిని ఆ బెర్త్ లో ప్రయాణం చేయమని చెప్పాలి, అప్పుడు ఆయనికి ప్రయాణీకుల ఇబ్బంది తెలిసివచ్చేది.
బెర్త్లు సరిపోకపోతే ఇంకొక భోగి పెంచటమో లేక పోతే వీలుని బట్టి ఆ మార్గం లో ఇంకొక రైలు పెంచటమో చెయ్యాలి గాని ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు కాదు. అయినా కొత్త రైళ్ళు భిహార్ కే సరిపోవటం లేదు ఇక మిగిలిన రాష్ట్రాలకేమిస్తారు.
ఇప్పుడు అందరికి శుభవార్త ఏంటంటే ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని, ఈ కక్కుర్తి బెర్తుల తొలగింపు చర్య మొదులు పెట్టారు మన రైల్వే వారు, దేవుడా ఇప్పటికైనా మా మీద నీకు దయ కలిగింది సంతోషం, అలాగే రైల్వే వారికి కృతజ్ఞతలు మరియు శతకోటి నమస్కారాలు.
ఈ కక్కుర్తి బెర్త్ ల వల్ల బాగుపడింది ఎవరంటే, వాటిని అమర్చిన కాంట్రాక్టర్లు, కంపెనీలు. ఇంతకాలం ఇబ్బంది పడింది మాత్రం ప్రయాణికులు.
ఈ తొలగింపు తొందరగా పుర్తికావాలని కోరుకుంటూ..... ధన్యవాదాలు :) .
5, మే 2009, మంగళవారం
ఎవరు ఎవరితో కలుస్తారో....!
ఎన్నికలు అయిపోయినవి,
ఇంకా 10 రోజులు ఆగితే మన రాజకీయ నాయకుల మరియు మన రాష్ట్ర భవితవ్యం తెలుస్తుంది. ప్రజలు మార్పుని కోరుకుంటున్నారా లేక కలర్ T.V లని కోరుకుంటున్నారా , లేకపోతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి నమ్మారా అనేది కూడా తెలుస్తుంది.
ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి మన రాష్ట్రంలో ముక్కోణపు పోటి జరిగింది.ఎన్నికలు జరిగేంత వరకు అన్ని పార్టీల వాళ్ళు కూడా మిగిలని పార్టీల వాళ్ళని తిట్టారు మరియు కొట్టుకున్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలపై వాళ్ళు ఒక వైపు ధీమాగా వున్నారు ఇంకొక వైపు అనుమానం గాను వున్నారు. మొన్నటి వరుకు మెజారిటీ మాకే వస్తుంది అని చెప్పుకున్నారు, ఇప్పటికీ చెప్పుకుంటున్నరనుకోండి, కాకపోతే హంగ్ గురించి కూడా అన్ని ప్రాధాన పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత నిజంగా హంగ్ ఏర్పడితే ఎవరు ఎవరితో కలుస్తారనేదే గమనిఅంచవలసిన అంశం, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నెన్ని తిట్టుకున్నారో, విమర్శించుకున్నారో వాళ్ళకే తెలియదు, ఇవన్ని మర్చిపోయి కలసిపోతారా? ఏమో అధికారం కోసం కలిసినా కలసిపోతారు!!
అప్పుడే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టిలు ప్రజారాజ్యంతో కలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయంట!.చిరంజీవి కి రాజకీయ అనుభవం లేదు, సొంత ఊరికి ఏమి చెయ్యలేదు అని అన్న వాళ్ళు ఎలా కలుపుకోవాలనుకుంటున్నారో తెలుయదు. ఇప్పటి వరుకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసాం, అవినీతిలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం నాయకులు ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు అని చెప్పిన చిరంజీవి ఎలా కలుస్తారోమరి?
ఏదిఎమైనా ఫలితాలు వచ్చేవరకు ఆగవలసిందే.
ఇంకా 10 రోజులు ఆగితే మన రాజకీయ నాయకుల మరియు మన రాష్ట్ర భవితవ్యం తెలుస్తుంది. ప్రజలు మార్పుని కోరుకుంటున్నారా లేక కలర్ T.V లని కోరుకుంటున్నారా , లేకపోతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి నమ్మారా అనేది కూడా తెలుస్తుంది.
ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి మన రాష్ట్రంలో ముక్కోణపు పోటి జరిగింది.ఎన్నికలు జరిగేంత వరకు అన్ని పార్టీల వాళ్ళు కూడా మిగిలని పార్టీల వాళ్ళని తిట్టారు మరియు కొట్టుకున్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలపై వాళ్ళు ఒక వైపు ధీమాగా వున్నారు ఇంకొక వైపు అనుమానం గాను వున్నారు. మొన్నటి వరుకు మెజారిటీ మాకే వస్తుంది అని చెప్పుకున్నారు, ఇప్పటికీ చెప్పుకుంటున్నరనుకోండి, కాకపోతే హంగ్ గురించి కూడా అన్ని ప్రాధాన పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత నిజంగా హంగ్ ఏర్పడితే ఎవరు ఎవరితో కలుస్తారనేదే గమనిఅంచవలసిన అంశం, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నెన్ని తిట్టుకున్నారో, విమర్శించుకున్నారో వాళ్ళకే తెలియదు, ఇవన్ని మర్చిపోయి కలసిపోతారా? ఏమో అధికారం కోసం కలిసినా కలసిపోతారు!!
అప్పుడే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టిలు ప్రజారాజ్యంతో కలవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయంట!.చిరంజీవి కి రాజకీయ అనుభవం లేదు, సొంత ఊరికి ఏమి చెయ్యలేదు అని అన్న వాళ్ళు ఎలా కలుపుకోవాలనుకుంటున్నారో తెలుయదు. ఇప్పటి వరుకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసాం, అవినీతిలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం నాయకులు ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు అని చెప్పిన చిరంజీవి ఎలా కలుస్తారోమరి?
ఏదిఎమైనా ఫలితాలు వచ్చేవరకు ఆగవలసిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)